శంతన్పై కాల్పుల కేసు: లొంగిపోయిన హైదరాబాదీ
విజయవాడ: మాజీ శాసనసభ్యుడు వంగవీటి చలపతిరావు కుమారుడు శంతన్కుమార్పై కాల్పుల కేసులో పోలీసులకు ఇప్పటి వరకు ముగ్గురు చిక్కారు. శంతన్పై కాల్పుల కేసులో రెండో షూటర్గా అనుమానిస్తున్న హైదరాబాద్కు చెందిన రాజు అనే వ్యక్తి సోమవారం హైకోర్టులో లొంగిపోయాడు. దీంతో పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లయింది. మిగతావారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇంతకు ముందు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కూడా పోలీసులకు చిక్కాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సుబ్రహ్మణ్యానికి నేర చరిత్ర వుందని పోలీసులు చెప్పారు. శంతన్ హత్యకు కుట్రకు ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న ఇద్దరిలో శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా హైకోర్టులో లొంగిపోయాడు. మరో సూత్రధారిగా భావిస్తున్న తెలుగుదేశం నాయకుడు కాట్రగడ్డ బాబు పరారీలో వున్నట్లు తెలుస్తోంది. నిందితుల నుంచి పోలీసులు 9 ఎం ఎం పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. తాము శంతన్పై కాల్పుల కేసులో టెలిఫోన్ సాక్ష్యాలు సేకరించామని పోలీసులు చెబుతున్నారు.