వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్స్‌లో మద్దెలచెర్వు సూరికి వైద్య పరీక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలుగుదేశం శాసనసభ్యుడు పరిటాల రవి హత్య కేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్‌ సూరిని వైద్య పరీక్షల నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. నరాల బలహీనతతో బాధపడుతున్న సూరికి వైద్య పరీక్షలు చేసేందుకు అనంతపురం జైలు ఉంచి నిమ్స్‌కు తెచ్చారు. అనంతపురంలో సూరికి పరీక్షలు నిర్వహించారు. అయితే అక్కడి వైద్యల సూచనల మేరకు కోర్టు అనుమతితో హైదరాబాద్‌కు తరలించారు.

నరాల బలహీనతతో పాటు సూరి రక్తంపోటుతో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యులు నిమ్స్‌లో సూరికి పరీక్షలన్నీ నిర్వహించారు. అనంతరం పోలీసులు ఆయనను అనంతపురం తరలించారు. సూరి నిమ్స్‌లో వున్నంత వరకు అక్కడి రోగులు తీవ్ర ఇబ్బందులకు, అసహనానికి గురయ్యారు. సూరికి వైద్యపరీక్షలు నిర్వహించే సమయంలో గట్టి భద్రతా ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X