వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సస్పెన్షన్ అప్రజాస్వామికం: విజయ రామారావు
హైదరాబాద్: తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ శాసనసభ లోపల ఒక మాట, వెలుపల మరో మాట మాట్లాడుతోందని ఆయన సభ నుంచి సస్పెండ్ అయిన అనంతరం సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు కె. కేశవరావు కూడా అంటున్నారని, మరి శాసనసభలో తెలంగాణపై చర్చకు ఎందుకు అంగీకరించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీకి కట్టుబడివ వున్నామని కాంగ్రెస్ నాయకులు అనడం తెలంగాణ ప్రజలను దగా చేయడమేనని ఆయన విమర్శించారు. రెండో ఎస్సార్సీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అనుకుంటే రెండున్నర యేళ్లలో ఎందుకు వేయలేదని ఆయన అడిగారు.
Comments
Story first published: Monday, August 28, 2006, 23:53 [IST]