వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లిడ్క్యాప్ భూముల అమ్మకంపై పిజెఆర్ వ్యతిరేకం
హైదరాబాద్: లిడ్క్యాప్ భూములను విక్రయించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. లిడ్క్యాప్ తన నియోజకవర్గంలో వుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. లిడ్క్యాప్ భూముల విక్రయం సరి కాదని ఆయన అన్నారు.
ఎస్సిలకు ఉపయోగపడే విధంగా దాన్ని తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వం లిడ్క్యాప్ భూములను ప్రభుత్వం సింగపూర్ కంపెనీకి ఎందుకు విక్రయిస్తోందో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పరిశ్రమలను నెలకొల్పడానికి ఆ భూములను ఎస్సిలకు ఇస్తే బాగుండేదని, దానికి విరుద్ధంగా ఆ భూములను సంస్థలకు ఇవ్వడం మంచిది కాదని ఆయన అన్నారు. సింగపూర్ కంపెనీకి లిడ్క్యాప్ భూములను ఇవ్వడం వల్ల ఎస్సిలకు ఏ విధమైన ఉపయోగం లేదని ఆయన అన్నారు.
Story first published: Tuesday, August 29, 2006, 23:53 [IST]