వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై మేం చేసేదేమీ లేదు: రఘువంశ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసినందున తమ కమిటీ చేసేదేమీ లేదని తెలంగాణపై ఏర్పాటయిన యుపిఎ సబ్ కమిటీ సభ్యుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి రఘువంశ ప్రసాద్ సింగ్ అన్నారు. హైదరాబాద్లోని ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన శుక్రవారం కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ)లో తెలంగాణ అంశం లేవనెత్తేవారెవరూ లేరని ఆయన అన్నారు. తెలంగాణ అంశం ఇక చర్చకు వచ్చే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తెలంగాణ అంశం తమ కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో వుందని, అయితే తెరాస బయటకు వచ్చినందున తాము చేసేదేమీ లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
Comments
Story first published: Friday, September 1, 2006, 23:53 [IST]