వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రభుత్వానిది హోల్సేల్ దోపిడీ: దేవేందర్
వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఇంతకు ముందు ప్రాజెక్టుల పేరుతో, ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్డు పేరుతో ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం హోల్సేల్గా దోచుకుంటోందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.
బడ్జెట్ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా ఖర్చు చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తుంటే తమను అభివృద్ధి నిరోధకులుగా చిత్రిస్తున్నారని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, September 3, 2006, 23:53 [IST]