వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఐయస్ ఏజెంటు అరెస్టు: కుట్ర భగ్నం
హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లో విధ్వంసం సృష్టించడానికి పాకిస్థాన్ ఐయస్ఐ పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. మహ్మద్ షకీల్ అనే ఐయస్ఐ ఏజెంటును అరెస్టు చేయడంతో ఆ కుట్ర బహిర్గతమైంది. షకీల్ నుంచి పోలీసులు సిడీలు స్వాధీనం చేసుకున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి మత విష ప్రచారం చేసే సందేశం ఆ సీడిల్లో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
వినాయక నిమజ్జనం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమీషనర్ ఎ.కె. మహంతి మీడియా ప్రతినిధులతో చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐయస్ఐ కుట్ర బహిర్గతమైన నేపథ్యంలో పోలీసులను అప్రమత్తం చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Monday, September 4, 2006, 23:53 [IST]