వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాయుగుండంతో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఒరిస్సా తీరంలోని చాంద్బలి వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తాలో వర్షాలు పడే అవకాశం వుందని విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కార్యాలయం అధికారులు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వారు చెబుతున్నారు. మిగతా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడవచ్చు. కోస్తా తీరంలో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని వారంటున్నారు.
విశాఖపట్నం, కళింగపట్నం, కాకినాడ ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా వుండడంతో చేపలు పట్టడానికి వెళ్లకూడదని అధికారులు మత్స్యకారులను ఆదేశించారు.
Comments
Story first published: Monday, September 4, 2006, 23:53 [IST]