వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతు సమస్యలకు శాస్త్రవేత్తలే పరిష్కారం చూపాలి: వైయస్
హైదరాబాద్: రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత శాస్త్రవేత్తలపై వుందని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ సభలో ఆయన మాట్లాడారు. నీటి నిర్వహణ, మేలు రకాల వంగడాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టి దిగుబడి పెరిగేందుకు దోహదపడాలని ఆయన సూచించారు.
పంటల దిగుబడి పెరిగితేనే సంపూర్ణ అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు జరగాలని ఆయన సూచించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుదలకు భద్రత, పంటల దిగుబడి అత్యంతావశ్యకమని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, September 4, 2006, 23:53 [IST]