వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: 6గురు దుర్మరణం
హైదరాబాద్: కడప జిల్లా మైదుకూరు సమీపంలోని బైనపల్లి వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఆరుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ సమీపంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన యువకులు తిరుమల వెళ్తుండగా మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా వుంది.
వినాయక నిమజ్జనం జరిపిన అనంతరం టాటా సుమోలో యువకులు తిరుమలకు బయలుదేరారు. టాటా సుమో మైదుకూరు సమీపానికి చేరుకున్న సమయంలో రోడ్డు పక్కన ఆగి వున్న లారీ ఢీకొట్టింది. దీంతో టాటా సుమోలో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించారు. టాటా సుమో డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో అదుపు తప్పి లారీని ఢీకొట్టినట్లు చెబుతున్నారు.
Story first published: Tuesday, September 5, 2006, 23:53 [IST]