వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైతు సమస్యలపై వైయస్ నిర్లక్ష్యం: సిపియం
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలను రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతుల ఆత్మహత్యలను నివారించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. రైతుల రుణభారంపై, మార్కెటింగ్ సౌకర్యాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. జయతీ ఘోష్ నివేదికపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైనందుననే రైతుల ఆత్మహత్యలు కొససాగుతున్నాయని అన్నారు. రైతుల రుణాలు మాఫీ చేయాలని, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Story first published: Thursday, September 7, 2006, 23:53 [IST]