వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసమానతలు దేశ ఐక్యతకు దెబ్బ: జెపి
నల్లగొండ: ప్రాంతీయ అసమానతలు దేశ ఐక్యతను దెబ్బ తీస్తాయని లోక్సత్తా కన్వీనర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ప్రాంతీయ అసమానతలను రూపుమాపడం ద్వారా వెనుకబాటుతనాన్ని నివారించవచ్చునని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. పోలీసు యంత్రాంగం రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయిందని ఆయన విమర్శించారు. లోక్సత్తాను రాజకీయ పార్టీగా ప్రకటించడానికి ముందు నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాల నిర్వహణలో భాగంగా ఆయన నల్లగొండకు వచ్చారు. అక్టోబర్ 15వ తేదీన లోక్సత్తా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, September 8, 2006, 23:53 [IST]