వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాలమూరు జిల్లాలో మందుపాతరల స్వాధీనం

By Staff
|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలీసులు ఆదివారంనాడు మావోయిస్టుల మందుపాతరలను కనుక్కున్నారు. మందుపాతరల నుంచి డిటొనేటర్లను, ఇతర పేలుడు సామగ్రిని వెలికి తీసి నిర్వీర్యం చేశారు. మావోయిస్టులకు చెందిన భారీ ఆయుధాల డంప్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ మందుపాతరలను వెలికితీయడం ద్వారా మావోయిస్టులపై మరోసారి పైచేయి సాధించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొల్లాపూర్‌ మండలంలో వీటిని పోలీసులు కనుక్కున్నారు.

పోలీసులు కొల్లాపూర్‌, లింగాల గ్రామాల వద్ద 19 మందుపాతరలను కనుక్కున్నారు. 80 కిలోల చొప్పున డెటోనేటర్లను పెట్టి వుంచిన 19 బకెట్లను పోలీసులు కనుక్కున్నారు. మహబూబ్‌నగర్‌, ప్రకాశం జిల్లాల్లో పోలీసులు ఇటీవలే మావోయిస్టుల రాకెట్‌ లాంచర్లను, ఇతర ఆయుధ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X