వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జలయజ్ఞం కాదు, ధనయజ్ఞం: సిపియం
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు వ్యాఖ్యానించారు. పేరు ప్రఖ్యాతుల కోసం పూర్తి కాని నీటి పారుదల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. నిర్వాసితులను నిర్బంధించి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వాసితులను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని,న నిర్వాసితులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం లేదని ఆయన అన్నారు. ప్రజల గొంతు నొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించాలనుకుంటే ప్రభుత్వానికి పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు.
Comments
Story first published: Monday, September 11, 2006, 23:53 [IST]