వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెరాస తిట్లే మాకు దీవెనలు: కేశవరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత తిట్లే తమకు దీవెనలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అన్నారు. తెరాస నాయకుల విమర్శల ప్రభావం తమ పార్టీపై పడదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చుకోవడానికి తెరాస నాయకులు బూతులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
తెరాస నాయకులు బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, సరైన పద్ధతిలో మాట్లాడితే ఏమైనా మాట్లాడడానికి వీలుంటుందని ఆయన అన్నారు. తెరాస నాయకుల తీరుపై తాను వ్యాఖ్యానించబోనని ఆయన అన్నారు. అమ్మా, అక్కా అనడం సరైంది కాదని ఆయన అన్నారు. వారికి బలం చేకూర్చాలని తాను భగవంతుడిని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, September 11, 2006, 23:53 [IST]