విశాఖలో అల్లు విగ్రహం: చిరుకు బ్రహ్మరథం
బెంగుళూరు: కర్ణాటకలో జెడిఎస్-బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం డిమాండ్ చేసింది. హెచ్డి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ సర్కారును డిస్మిస్ చేయాలని కోరుతూ పిసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గే నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు హెచ్కె పాటిల్, ఎన్ ధరంసింగ్, సిద్ధరామయ్య, డికె శివకుమార్, ఆర్వి దేశ్నాండేలు గవర్నర్ చతుర్వేదిని కలిసి మెమొరాండం సమర్పించారు. గనుల తవ్వకం కుంభకోణంలో కుమారస్వామి సర్కారుకు 150 కోట్ల రూపాయలు ముడుపులు అందాయని వారు ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద బలమైన ఆధారాలున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పలు విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పిందని వారు గవర్నర్కు వివరించారు. ఈ కుంభకోణంపై సిబిఐచే విచారణ జరిపించేందుకు కేంద్రానికి లేఖ రాయాలని, ముఖ్యమంత్రి కుమారస్వామి, హోంమంత్రి ఎంపి ప్రకాశ్, అటవీశాఖ మంత్రి చిన్నిగప్పలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు గవర్నర్కు విజ్ఞప్తి చేశారు.