వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎన్కౌంటర్ వివరాలు తెలియవు: జానారెడ్డి
హైదరాబాద్: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలు తనకు తెలియదని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. ఇంకా తనకు వివరాలు అందాల్స వుందని ఆయన శుక్రవారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో అన్నారు. వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగినట్లు మాత్రం తనకు తెలిసిందని, నలుగురు నక్సల్స్ మరణించినట్లు తెలిసిందని ఆయన చెప్పారు.
ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులను ఇంకా గుర్తించాల్సి వుందని ఆయన చెప్పారు. ఈ ఎన్కౌంటర్ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగిందని ఆయన చెప్పారు. ఎన్కౌంటర్ ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించినట్లు తనకు సమాచారం ఉందని ఆయన చెప్పారు.
Comments
Story first published: Friday, September 15, 2006, 23:53 [IST]