మా ఆయన బంగారం: నాగఫణి శర్మ భార్య
హైదరాబాద్: మా అయన బంగారం అని సహస్రావధాని నాగఫణి శర్మ భార్య అన్నారు. మీడియాలోని ఒక వర్గం నాగఫణి శర్మపై అసత్య ఆరోపణలను రుద్దుతోందని ఆమె అన్నారు. ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో శుక్రవారంనాడు మాట్లాడారు. తపస్సు, ధాన్యముద్ర వీడిని తర్వాత నాగఫణి శర్మ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతారని ఆమె చెప్పారు. అది ఎప్పుడనేది తాను చెప్పలేనని ఆమె అన్నారు. తన భర్తపై వచ్చిన ఆరోపణలు త్వరలో సమసిపోతాయని ఆమె అన్నారు.
ధ్యానం, తపస్సు, యోగముద్ర తప్ప వేరేది తన భర్త నాగఫణి శర్మకు పట్టదని ఆమె అన్నారు. తన భర్త అవధాన చక్రవర్తి అని, మహాకవుల సరసన నిలబడాల్సిన వారని ఆమె అన్నారు. ప్రైవేట్ టీవీ ఛానెల్ ప్రతినిధితో ఆమె మాట్లాడుతున్నప్పుడు నాగఫణి శర్మ ఆమె పక్కనే వున్నారు. అమెరికాలో ఒక మహిళపై అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణపై ఆయన మీద కేసు నమోదయిన విషయం తెలిసిందే. అజ్ఞాతం వీడిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి ఏ మాత్రం ఇష్టపడడం లేదు.