వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్లో కాంగ్రెస్ పోటీ చేయదు
హైదరాబాద్: కరీంగనర్ పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరిగితే టిఆర్ఎస్ మీద కాంగ్రెస్ పోటీ చేయబోదని పిసిసి అధ్యక్షుడుకె. కేశవరావు శనివారం స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిఆర్ఎస్ యుపిఎ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున తాము వారితో పోటీ పడబోమని చెప్పారు. మిత్రపక్షాల పోటీ ఉండదని ఆయన అన్నారు. ఒకవేళ టిఆర్ఎస్ యుపిఎ నుంచి తప్పుకుంటే పోటీచేసే విషయం అప్పుడు ఆలోచిస్తామని కేశవరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిలు మధుయాష్కీ గౌడ్, సర్వే సత్యనారాయణలు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా చేసిన వాఖ్యలపై వ్యాఖ్యానిస్తూ వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదని కేశవరావు కొట్టిపారేశారు.
Comments
Story first published: Saturday, September 16, 2006, 23:53 [IST]