వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్లో పట్టపగలు దారుణ హత్య
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా శనివారం హత్య జరిగింది. అంబర్పేట మొయిన్రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద అప్సర్ఖాన్ అనే వ్యక్తిని నలుగురు దుండగులు తల్వార్లతో పొడిచి పంపారు. స్థానిక బస్స్టాండ్ వద్ద నిల్చుని ఉన్న అప్సర్ఖాన్ను దుండగులు వెంటాడి తల్వార్లతో విచక్షణా ర హితంగా పొడిచారు. తీవ్రగాయాలైన అప్సర్ఖాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. హత్య గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ఫ్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Saturday, September 16, 2006, 23:53 [IST]