వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేణుకాచౌదరిని ఘెరావ్ చేసిన ఖమ్మం విద్యార్ధులు
ఖమ్మం: కేంద్ర మంత్రి రేణుకాచౌదరిని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు ఘెరావ్ చేశారు. ప్రైవేటు కళాశాలలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ కళాశాలలను మూసివేయడాన్ని నిరసిస్తూ విద్యార్ధులు ఈ చర్యకు దిగారు. పోలీసుల అండతో మంత్రి రేణుకాచౌదరి విద్యార్ధులపై తిరగబడ్డారు. ప్రభుత్వ అతిధి గృహంలో జిల్లా వైద్యశాఖ అధికారులతో సమావేశం కావడానికి వస్తున్న ఆమెను విద్యార్ధులు అడ్డుకున్నారు. తమకు సంజాయిషీ చెప్పేవరకు మంత్రిని ముందుకు కదలనివ్వబోమని విద్యార్ధులు మొరాయించడంతో, పోలీసులు, ఆమె అనుచరులు వారిని అడ్డుకున్నారు. అనంతరం రేణుక నడుచుకుంటూ గెస్ట్ హౌస్ వరకు నడుచుకుంటూ వెళ్ళారు.
Comments
Story first published: Saturday, September 16, 2006, 23:53 [IST]