వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తరుమలపై బాబుకిది తగదు: కరుణాకర్
తిరుపతి: తిరుపతిలో అన్యమత ప్రచారం జరుగుతోందనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శలను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ కరుణాకర్ ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడడం చంద్రబాబుకు తగదని ఆయన అన్నారు. తిరుమలలో ధర్మప్రచారం కచ్చితంగా జరుగుతుందని ఆయన చెప్పారు.
తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతోందని లౌకిక పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆ విధంగా మాట్లాడడం చంద్రబాబుకు మంచిది కాదని ఆయన అన్నారు.
Story first published: Sunday, September 17, 2006, 23:53 [IST]