వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెస్టిండీస్‌పై భారత్‌ సంచలన విజయం

By Staff
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్‌: వెస్టిండీస్‌పై భారత్‌ వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో సంచలన విజయం సాధించింది. వెస్టిండీస్‌పై భారత్‌ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ ఉంచిన అతి తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్‌ విఫలమైంది. వెస్టిండీస్‌ 146 పరుగులకే చేతులెత్తేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత యాభై ఓవర్లను కూడా పూర్తి చేయలేకపోయింది. 39.3 ఓవర్లలో 162 పరుగులు మాత్రమే చేసింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లో సచిన్‌ టెండూల్కర్‌ నిలకడగా ఆడి 65 పరుగులు చేశాడు. హర్భజన్‌ సింగ్‌ 37 పరుగులు చేశాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ శుభారంభం చేసినప్పటికీ లాభం లేకపోయింది. లారా ఎంత పోరాడినప్పటికీ లాభం లేకపోయింది. లారా 40 పరుగులు చేశాడు. అజిత్‌ అగార్కర్‌, మునాఫ్‌ పటేల్‌, శ్రీశాంత్‌ రెండేసి వికెట్లు తీసుకున్నాడు. హర్బజన్‌ సింగ్‌కు మూడు వికెట్లు లభించాయి. ఆర్‌పి సింగ్‌కు ఒక వికెట్‌ లభించింది. ఈ విజయంతో భారత్‌ ఫైనల్లోకి ప్రవేశించడానికి ఆశ చిగురించింది. ఆస్ట్రేలియా కన్నా భారత్‌ ఒక పాయింట్‌ వెనకబడి ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X