సర్వేకు క్షమాపణ చెప్పడానికి సిద్ధమే: రాజగోపాల్
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ విషయంలో అధిష్ఠానవర్గం చెప్పినట్లు నడుచుకుంటానని సిద్ధిపేట కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ చెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ను కలిసిన అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజగోపాల్ ప్రవర్తనలో మార్పు రాలేదని, అలా మార్పు రానంత వరకు తాను వెనక్కి తగ్గబోనని ఆయన చెప్పారు. రాజగోపాల్ను పార్టీ నుంచి బహిష్కరించాలని తాను దిగ్విజయ్సింగ్ను కోరినట్లు ఆయన తెలిపారు.
తమ మధ్య చెలరేగిన వివాదంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) జోక్యం చేసుకుని క్షమాపణలు అడగడమేమిటని ఆయన అడిగారు. సర్వే సత్యనారాయణ ఫోన్ చేసి తన మనోభావాలు దెబ్బ తిన్నట్లు చెప్పి వుంటే క్షమాపణలు చెప్పి ఉండేవాడినని ఆయన అన్నారు. తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. తనను సర్వే సత్యనారాయణ అల్లుడు అంటారని, తాను మామా అంటానని ఆయన చెప్పారు.