వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిసిసి తీర్మానానికి పవిత్రత లేదు: కెసిఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ సమక్షంలో జరిగిన ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పిసిసి) కార్యవర్గ సమావేశంలో చేసిన తీర్మానానికి పవిత్రత లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణపై ఎవరూ మాట్లాడకూడదని నిర్ణయిస్తూ పిసిసి బుధవారంనాడు తీర్మానం చేసింది. దీనిపై కెసిఆర్‌ తీవ్రంగా ప్రతిస్పందించారు. స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీని కలవడానికి ఢిల్లీ బయలుదేరి వెళ్లే ముందు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తీర్మానం చేసిన గంటకే ఆంధ్రా కాంగ్రెస్‌ నేతలు దాన్ని ఉల్లంఘించారని ఆయన అన్నారు. ఆంధ్రా నేతలకు ఒక నీతి, తెలంగాణ నాయకులకు మరో నీతా? అని ఆయన అడిగారు. తాను శనివారం 11 గంటలకు తన రాజీనామా విషయమై లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీని కలుస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్ఠానవర్గం కోరితే రేపు, ఎల్లుండి మాట్లాడడానికి తాను సిద్ధమేనని ఆయన చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ స్పష్టమైన హామీ ఇస్తేనే తాను రాజీనామాను ఉపసంహరించుకుంటానని ఆయన చెప్పారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X