వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పోలీసు ఔట్పోస్టుపై మావోయిస్టుల దాడి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలం పెద మల్లాపురం ఆర్మ్డ్ రిజర్వ్ ఔట్పోస్టుపై నక్సలైట్లు కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు కూడా 40 రౌండ్లు కాల్పులు జరిపారు. ఔట్పోస్టులో సెంట్రీలు డ్యూటీలు మారే సమయంలో శనివారం ఈ కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. మావోయిస్టులు దాడి చేసిన సమయంలో ఔట్ పోస్టులో 40 మంది వ రకు పోలీసు సిబ్బంది ఉన్నారని. దాడిలో ఎందరు మావోయిస్టులు పాల్గొన్నారో స్పష్టంగా తెలియరాలేదని ఆయన చెప్పారు.
Comments
Story first published: Saturday, September 23, 2006, 23:53 [IST]