పోలీసు వ్యవస్థలో సంస్కరణలకు సుప్రీం సూచన
న్యూఢిల్లీ: పోలీసు వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించింది. రాష్ట్ర భద్రతా కమీషన్లతో పాటు జాతీయ భద్రతా కమీషన్ను ఏర్పాటు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు స్వతంత్రంగా వ్యవహరించడానికి ఈ కమీషన్లు ఉపకరిస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి), పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజిపి) పదవీ కాలం రెండేళ్ల పాటు ఉండాలని సూచించింది.
దేశంలో దర్యాప్తునకు, చట్టాల అమలుకు వేర్వేరు విభాగాలుండాలని కూడా సూచించింది. రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ ప్రకాశ్ సింగ్ వేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ వై.కె. సబర్వాల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈ సూచనలు చేసింది. ఈ విషయంలో డిసెంబర్ 31వ తేదీలోగా విధివిధానాలను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తమ సూచనలను పరిశీలించి నాలుగు వారాల లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి, జాతీయ మానవ హక్కుల కమీషన్కు సూచించింది. అంతర్రాష్ట సంబంధాలు, అంతర్జాతీయ సంబంధాలు ఉన్న నేరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి అప్పగించాలని కూడా సూచించింది.