వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లక్ష మెజారిటీతో గెలుస్తాం: తెలుగుదేశం
హైదరాబాద్: కరీంనగర్ లోక్సభ ఉపఎన్నికలో తెలుగుదేశం పార్టీ లక్ష మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆ పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు మోసం చేశాయని, ఆ పార్టీలకు బుద్ధి చెప్పడానికి ఇది సరైన సమయమని టిడిపి సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. టిడిపి అభ్యర్ధిగా ఎవరు నిలబడినా గెలిచి తీరుతారని ఆయన చెప్పారు. స్ధానికి సంస్ధల ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శన మని దయాకరరావు అన్నారు. వామపక్షాల మద్దతు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Comments
Story first published: Saturday, September 23, 2006, 23:53 [IST]