వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుపిఎకు మద్దతు ఉపసంహరించుకున్న టిఆర్ఎస్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి శనివారం యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది. యుపిఎకు మద్దతు ఉపసంహరించుకుంటూ రాష్ట్రపతికి లేఖ పంపినట్టు టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు మీడియా సమావేశంలో చెప్పారు. కనీస ఉమ్మడి కార్యక్రమంలో పేర్కొన్నట్టు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఇచ్చిన హామీని యుపిఎ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని, అందువల్ల వైదొలగుతున్నామని ప్రకటించారు. స్పష్టమైన ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో యుపిఎ విఫలమైందని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, September 23, 2006, 23:53 [IST]