క్రికెట్: డియల్యఫ్ కప్ విజేత ఆసీస్
కౌలాలంపూర్: డియల్యఫ్ కప్ను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్పై ఘన విజయం సాధించి డియల్యఫ్ కప్ను గెలుచుకుంది. తద్వారా తనకు తిరుగులేదని ఆసీస్ మరోసారి రుజువు చేసింది. భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు పాల్గొన్న ఈ ముక్కోణపు సిరీస్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా ఫైనల్కు చేరకున్నాయి.
ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్లో వెస్టిండీస్పై 127 పరుగుల భారీ ఆధిక్యతతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వెస్టిండీస్ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్ చతికిలపడింది. శర్వాన్, చంద్రపాల్ మినహా వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. 34.2 ఓవర్లలో 113 పరుగులకే వెస్టిండీస్ చేతులెత్తేసింది. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసుకున్న ఆసీస్ బౌలర్ బ్రెట్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికయ్యాడు. బ్రేకన్ మూడు వికెట్లు, వాట్సన్ రెండు వికెట్లు తీసుకున్నారు.