వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్ ఎన్నిక రెఫరెండం కాదు: సిపిఐ
కరీంనగర్: కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణపై రెఫరెండం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. కరీంనగర్ వరద బాధితులను పరామర్శించడానికి సిపిఐ శాసనసభా పక్షం నాయకుడు చాడ వెంకటరెడ్డితో కలిసి ఆయన కరీంనగర్ వచ్చారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. రాజీనామాల విషయంలో మంత్రి ఎం. సత్యనారాయణ రావు, పిసిస అధ్యక్షుడు కె. కేశవరావు, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖరరావు వ్యవహరించిన తీరు బాగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కరీంనగర్ లోక్సభ స్థానానికి రాజీనామా చేసే విషయంలో ఎమ్మెస్సార్, కెసిఆర్ గోలీకాయలు ఆడుకున్న రీతిలో వ్యవహరించారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలతో సంబంధం లేకుండా కెసిఆర్ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికకు సిద్ధపడడం బాధ్యతారాహిత్యమని ఆయన అన్నారు.
Comments
Story first published: Sunday, September 24, 2006, 23:53 [IST]