వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విదేశీ కరెన్సీ ఆశ చూపిన నైజీరియన్ అరెస్టు
వరంగల్: విదేశీ కరెన్సీ ఆశ చూపి ప్రజలను మోసం చేస్తున్న ఒక నైజీరియన్ను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ఒక నైజీరియన్ పారిపోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఆదివారంనాడు చెప్పారు. పెద్ద మొత్తంలో అమెరికా డాలర్లు ఢిల్లీ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయాయని, వాటిని తీసుకురావడానికి డబ్బు అవసరమని చెబుతూ దానికి పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తూ ఇద్దరు నైజీరియన్లు ప్రజలను మోసం చేస్తున్నారు.
ఎయిర్పోర్టులో చిక్కుకుపోయిన అమెరికా డాలర్లను విడిపించుకొని రావడానికి 500 డాలర్లు అవసరమని చెప్పి, అవి రాగానే ఎక్కువ మొత్తం డాలర్లు ఇస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి నైజీరియన్లు 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవి తీసికెళ్లి అమెరికా డాలర్ల పార్సిల్ తెస్తామని నమ్మించి మోసం చేస్తున్నారు.
Comments
Story first published: Sunday, September 24, 2006, 23:53 [IST]