రాజకీయాల్లో ఇక రాహుల్ క్రియాశీలం: సోనియా
నైనిటాల్: రానున్న కాలంలో రాజకీయాల్లో రాహుల్ గాంధీ క్రియాశీలక పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారు. వచ్చే ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విస్తృతంగా ప్రచారం చేస్తారని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఉత్తరప్రదేశ్లో రాహుల్ క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆమె అన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల రెండు రోజుల సదస్సు అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ప్రచారంలో పాల్గొనడానికి రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు ఉత్తరప్రదేశ్ వెళ్తున్నాడని ఆమె చెప్పారు. ఉత్తరప్రదేశ్లో మంచి ఫలితాలు రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, గతంలో కన్నా పరిస్థితి మెరుగుపడగలదని ఆమె అన్నారు. ఉత్తరప్రదేశ్ను 8 జోన్లుగా విభజించి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. దీని వల్ల కింది స్థాయి కార్యకర్తలు పార్టీ నాయకులతో సంబంధాలు నెలకొల్పడానికి వీలవుతుందని ఆమె అన్నారు.