వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణపై మేం మోసం చేయలేదు: సోనియా
నైనిటాల్: తెలంగాణ విషయంలో తాము ఎవరినీ మోసం చేయలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, ఆ ప్రయత్నాలు కొనసాగుతూనే వుంటాయని ఆమె ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై ఎట్టకేలకు సోనియా గాంధీ నోరు విప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి తాము తలుపులు మూయలేదని సోనియా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికకు కట్టుబడి పని చేస్తున్నామని ఆమె చెప్పారు. భాగస్వామ్య పక్షాల్లో తెలంగాణపై ఏకాభిప్రాయ సాధనకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యుపిఎ సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీ చర్చలు జరిపారని, ఇప్పటి వరకు ఏకాభిప్రాయ సాధన రాలేదని ఆమె వివరించారు.
Story first published: Sunday, September 24, 2006, 23:53 [IST]