వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌, తెరాసలను ఎండగడ్తాం: టిడిపి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కరీంనగర్‌ లోక్‌సభ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెస్‌ల మోసాన్ని ఎండగడతామని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి చెప్పారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేశాయని ఆయన ఆదివారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ విషయంలో తెరాస, కాంగ్రెస్‌ రెండూ దొంగలేనని, పైగా ఈ పార్టీలు పరస్పరం విమర్శించుకుంటూ ఇంకా ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన అన్నారు. గోదావరి జలాల తరలింపు విషయంలో తాము కృషి చేస్తుంటే కాంగ్రెస్‌ తెలంగాణ నాయకులు, తెరాస నాయకులు ఏమీ మాట్లాడడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు, తెరాస ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని మరో తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్‌ రెడ్డి విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌ తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన హైదరాబాద్‌లో డిమాండ్‌ చేశారు. ఏకాభిప్రాయం సాధించడానికి కృషి చేస్తున్నామని సోనియా గాంధీ అంటున్నారే గానీ పార్టీ వైఖరిని స్పష్టం చేయడం లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. తెరాసను నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ మోసాన్ని బట్టబయలు చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ ఉందని మరో తెలుగుదేశం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌ రావు కరీంనగర్‌లో అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు కరీంనగర్‌లో అడుగు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజలను నమ్మించి కాంగ్రెస్‌, తెరాసలు మోసం చేశాయని ఆయన విమర్శించారు. కరీంనగర్‌ ఉప ఎన్నిక ఖర్చును కాంగ్రెస్‌, తెరాసల నుంచి వసూలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ తెస్తామని కెసిఆర్‌ అంటే ఆపే శక్తి తమకు లేదని తెలుగుదేశం నాయకుడు ముత్యం రెడ్డి మెదక్‌లో అన్నారు. కలియుగం ఉన్నంత వరకు తాము కాంగ్రెస్‌తో జత కట్టబోమని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X