వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తిరుమల కల్యాణకట్టలో మహిళా క్షురకులు
తిరుమల: తిరుమలలోని కల్యాణకట్టలో 18 మంది మహిళా క్షురకులను నియమించారు. వారు సోమవారం విధుల్లో చేరారు. తిరుమలలోని కల్యాణకట్టలో మహిళా క్షురకుల నియామకం జరగడం ఇదే తొలిసారి. మొదటి విడత తాత్కాలిక ప్రాతిపదికపై వీరిని నియమించామని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) అధికారులు చెప్పారు. అవసరాన్ని బట్టి మరింత మందిని తీసుకుంటామని వారు చెప్పారు.
తిరుమలలో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని కల్యాణకట్టలో మహిళా క్షురకలను నియమించాలని టిటిడి పాలక మండలి రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని కొందరు అభ్యంతర పెట్టడంతో తాత్కాలికంగా వారి నియామకం ఆగిపోయింది. హైకోర్టు తీర్పు చెప్పడంతో మహిళా క్షురకుల నియామకానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
Comments
Story first published: Monday, September 25, 2006, 23:53 [IST]