వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రింగ్ రోడ్డుపై నేరం అంగీకరించినట్లే: నోముల
మెదక్: హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణ ఆదేశించడమంటే నేరం అంగీకరించినట్లేనని సిపియం శాసనసభా పక్ష నాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు. రింగ్ రోడ్డు భూముల సేకరణలో అవినీతి ఆరోపణలపై రిటైర్డ్ జడ్జితో కాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఎందుకు మార్చారో సమాచార చట్టం ప్రకారం వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 1400 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వచ్చిన వార్తకు నోరు విప్పని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రింగ్ రోడ్డు అలైన్మెంట్పై ఎందుకు చిర్రుబుర్రులాడుతున్నారని ఆయన అడిగారు.
Comments
Story first published: Wednesday, September 27, 2006, 23:53 [IST]