వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎసిబి సోదాల్లో తేలిన మూర్తి కోట్ల ఆస్తులు

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: విశాఖపట్నం నగర పాలక సంస్థకు చెందిన ఉద్యోగి ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే కేసులో ఎసిబి అధికారులు విశాఖపట్నం నగర పాలక సంస్థ బిడ్డింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ మూర్తి ఇళ్లపై గురువారంనాడు దాడులు నిర్వహించారు. వీరి దాడుల్లో రెండున్నర కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి.

ఎసిబి అధికారులు శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడల్లో గల ఆయన ఆస్తులపై, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఆయనకు ఆపార్ట్‌మెంట్‌, విలువైన స్థలాలు, నగదు, బంగారు నగలు ఉన్నట్లు ఎసిబి సోదాల్లో తేలింది. కాకినాడలోని ఆయన మామ ఇంటిలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. మూర్తి ఆఫీసులో కూడా సోదాలు చేశారు. మూర్తి భార్యకు చెందిన కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X