వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎసిబి సోదాల్లో తేలిన మూర్తి కోట్ల ఆస్తులు
విశాఖపట్నం: విశాఖపట్నం నగర పాలక సంస్థకు చెందిన ఉద్యోగి ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే కేసులో ఎసిబి అధికారులు విశాఖపట్నం నగర పాలక సంస్థ బిడ్డింగ్ ఇన్స్పెక్టర్ మూర్తి ఇళ్లపై గురువారంనాడు దాడులు నిర్వహించారు. వీరి దాడుల్లో రెండున్నర కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
ఎసిబి అధికారులు శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడల్లో గల ఆయన ఆస్తులపై, బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఆయనకు ఆపార్ట్మెంట్, విలువైన స్థలాలు, నగదు, బంగారు నగలు ఉన్నట్లు ఎసిబి సోదాల్లో తేలింది. కాకినాడలోని ఆయన మామ ఇంటిలో కూడా ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. మూర్తి ఆఫీసులో కూడా సోదాలు చేశారు. మూర్తి భార్యకు చెందిన కార్యాలయంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు.
Comments
Story first published: Thursday, September 28, 2006, 23:53 [IST]