వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరీంనగర్లో బిజెపి అభ్యర్థి పోటీ: దత్తాత్రేయ
న్యూఢిల్లీ: కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్ణయించింది. బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేస్తారు. బిజెపి జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ గురువారంనాడు తమ పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కలుసుకున్నారు. వారిరువురి మధ్య దాదాపు అర గంట సేపు సమావేశం జరిగింది.
ఇరువురు నేతల మధ్య జరిగిన సమావేశంలో కరీంనగర్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తాము తెలంగాణకు మద్దతు ఇస్తున్నందున కరీంనగర్లో తమ అభ్యర్థిని బలపర్చాలని దత్తాత్రేయ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కోరారు. దీంతో బిజెపి తెరాసకు మద్దతు ఇస్తుందనే ప్రచారానికి తెర పడింది. కరీంనగర్ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారంలో వెలువడుతుందని భావిస్తున్నారు.
Comments
Story first published: Thursday, September 28, 2006, 23:53 [IST]