వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైకోర్టు స్టే: మంత్రి శత్రుచర్లకు ఊరట
హైదరాబాద్: తప్పుడు కుల ధృవీకరణ విషయంలో మంత్రి శత్రుచర్ల విజయరామరాజుపై చర్యలు తీసుకోవాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు గురువారం స్టే ఇచ్చింది. తప్పుడు కుల ధృవీకరణతో గెలిచిన శత్రుచర్ల విజయరామరాజుపై చర్య తీసుకోవాలని ఇంతకు ముందు సింగిల్ జడ్జి ఆదేశించారు. దీంతో శత్రుచర్ల విజయ రామరాజుకు ఊరట లభించింది.
ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ్యురాలు లలితకుమారి ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లలిత కుమారి ఎన్నికల చెల్లదని ఆరోపిస్తూ తిప్పేస్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు వచ్చిందని కోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది.
Comments
Story first published: Thursday, September 28, 2006, 23:53 [IST]