వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
కరీంనగర్: పట్టపగలు గురువారంనాడు ఒక యువకుడు కరీంనగర్లోని క్లాక్టవర్ వద్ద మూడంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది. ఈ సంఘటన అక్కడివారిని విషాదంలో ముంచెత్తింది. పోలీసులు, మీడియా ప్రతినిధులు వారించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమీప బంధువును పంపి అతడ్ని ఆత్మహత్య చేసుకోకుండా నిరోధించడానికి పోలీసులు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. కుటుంబ తగాదాలే ఈ ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు.
ఆటో డ్రైవర్గా పని చేస్తున్న రహీం అనే యువకుడు తన భార్యతో పడిన గొడవ విడాకుల వరకు దారి తీసింది. ఈ విడాకుల కేసులో మరో వారంలో తీర్పు వెలువడనుంది. దీంతో మనస్తాపనం చెందిన రహీం మూడంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Comments
Story first published: Thursday, September 28, 2006, 23:53 [IST]