వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భవనంపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: పట్టపగలు గురువారంనాడు ఒక యువకుడు కరీంనగర్‌లోని క్లాక్‌టవర్‌ వద్ద మూడంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరూ చూస్తుండగా ఈ ఘోరం జరిగిపోయింది. ఈ సంఘటన అక్కడివారిని విషాదంలో ముంచెత్తింది. పోలీసులు, మీడియా ప్రతినిధులు వారించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమీప బంధువును పంపి అతడ్ని ఆత్మహత్య చేసుకోకుండా నిరోధించడానికి పోలీసులు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. కుటుంబ తగాదాలే ఈ ఆత్మహత్యకు కారణమని చెబుతున్నారు.

ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న రహీం అనే యువకుడు తన భార్యతో పడిన గొడవ విడాకుల వరకు దారి తీసింది. ఈ విడాకుల కేసులో మరో వారంలో తీర్పు వెలువడనుంది. దీంతో మనస్తాపనం చెందిన రహీం మూడంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X