వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శ్రీకాకుళం జిల్లాలో నీట మునిగిన పొలాలు
శ్రీకాకుళం: వంశధార, నాగావళి నదులకు వరదలు రావడంతో శ్రీకాకుళం జిల్లాలోని ఈ నదుల పరీవాహక ప్రాంతాల్లో పొలాలు నీటిలో మునిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో వరదలు రావడం ఈ సీజన్లో ఇది రెండోసారి. అల్పపీడన ప్రభావంతో ఒరిస్సాలో భారీ వర్షాలు కురవడంతో ఆ ప్రభావం ఇక్కడ వంశధార, నాగావళి నదుల మీద పడింది. వంశధార నదీ పరీవాహక ప్రాంతాలైన కొత్తూరు. ఎల్ఎన్ పేట, సరుబుజ్జిలి, జిలుమూరు, నరసన్నపేట మండలాల్లో పొలాలు నీట మునిగాయి. గతంలో వరదలు వచ్చినప్పుడు కరకట్టలకు తాత్కాలికంగా మరమ్మతు చేయడంతో గ్రామాలకు వరద ముప్పు తప్పింది.
Comments
Story first published: Saturday, September 30, 2006, 23:53 [IST]