వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దుర్గాదేవి రూపంలో కనకదుర్గమ్మ దర్శనం
విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ దేవీనవరాత్రులలో భాగంగా శనివారం నాడు దుర్గాదేవిగా భక్తులకు దర్శనిమిచ్చింది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఘాట్రోడ్డు, మెట్ల మార్గంలో వేలాది భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. విఐపిలు కుటుంబసమేతంగా పెద్ద సంఖ్యలో వస్తుండడంతో సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఉండగా కనదుర్గమ్మ ఆలయంలో లడ్డూల నాణ్యత లోపించిందన్న ఆరోపణలు రావడంతో మునిసిపల్ అధికారులు విచారణ ప్రారంభించారు.
Comments
Story first published: Saturday, September 30, 2006, 23:53 [IST]