వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాంబుపేలుళ్ళ కేసులో హైద్రాబాద్ కాల్సెంటర్ ఉద్యోగి
హైదరాబాద్: ముంబయి బాంబుపేలుళ్ళ కేసులో అనుమానితుడైన నవీద్ అనే కాల్సెంటర్ ఉద్యోగిని హైదరాబాద్లో శనివారం అరెస్టు చేశారు. అమీర్పేటలోని ఆర్ఎస్ఆర్ కాల్సెంటర్లో పనిచేస్తున్న నవీద్ గత రెండేళ్ళుగా నేరేడ్మెట్లో ఒక అపార్టుమెంట్లో నివాసముంటున్నాడు. ముంబయి పోలీసులు అందించిన సమాచారంతో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు నవీద్ను అదుపులోకి తీసుకున్నారు. ముంబయి బాంబుపేలుళ్ళలో నవీద్కు ఎంత వరకు ప్రమేయం ఉందో ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Story first published: Saturday, September 30, 2006, 23:53 [IST]