భూదాన్ పోచంపల్లిలో కొత్త విశ్వవిద్యాలయం
హైదరాబాద్: తెలంగాణలో మరో యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదివారంనాడు ప్రకటించారు. ఈ యూనివర్శిటీని వెనుకబడిన నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ విశ్వవిద్యాలయాన్ని నల్లగొండ జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఈ యూనివర్శిటీకి ఇంకా పేరును ఖరారు చేయలేదు.
కరీంనగర్, విజయనగరం జిల్లాల్లో జవహర్లాల్ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెయన్టియు) కళాశాలలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. అలాగే ఆదిలాబాద్, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాల్లో స్వయంప్రతి హోదాతో వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 32 వైద్య కళాశాలలున్నాయి. ఈ కళాశాలలకు కూడా స్వయం ప్రతిపత్తి కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాజశేఖర రెడ్డి చెప్పారు.