వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాఠ్యాంశంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర: రాజ్యలక్ష్మి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నిజాం రాచరిక వ్యవస్థను కూల్చివేసేందుకు తెలంగాణ ప్రజలు చేసిన వీరోచిత పోరాట చరిత్రను రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా చేర్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని పాఠశాల విద్యా శాఖ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి తెలిపారు. తెలంగాణ విమోచనోధ్యమ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడాన్ని పరిశీలించే బాధ్యతను ఎస్‌సిఇఆర్‌టికి అప్పగించనున్నట్లు ఆమె చెప్పారు. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ మాన్‌స్క్రిప్ట్స్‌, చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీలు సంయుక్తంగా నిర్వహించనున్న అవగాహానా ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు.

జాతిపిత మహత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని డిస్కవరీ మ్యాగజైన్‌ రూపొందించిన ప్రత్యేక సంచికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి రాజ్యలక్ష్మి మాట్లా రాష్ట్రంలో ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలపై నిషేధం అంటూ ఏది లేదని, ఎయిడెడ్‌ పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన కసరత్తు జరుగుతుందని చెప్పారు. స్వాతంత్య్రపోరాట నేపథ్యంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్థాపించిన పాఠశాలలు ఎన్నో ఉన్నాయని, అయితే కొన్ని ఎయిడెడ్‌ పాఠశాలల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడుతున్నందున తత్కాలికంగా ఆపామే తప్ప నిషేధం విధించలేదని స్పష్టం చేశారు. అది కూడా గత ప్రభుత్వం చేపట్టిందేనని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X