వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి: ఒక వ్యక్తి మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల ముగింపు రోజు మంగళవారం అపశ్రుతి చోటు చేసుకుంది. పుష్కరిణిలో మునిగి 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఇతన్ని ఇంకా గుర్తించాల్సి వుంది. ఆనవాళ్లను బట్టి అతను కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడై వుండవచ్చునని భావిస్తున్నారు. శ్రీవారికి చక్ర స్నానం చేయించే సందర్భంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

శ్రీ తిరుమలేశుని పుష్కరిణిలో పవిత్రం చేసే సమయంలో భక్తులు పెద్ద యెత్తున చూసేందుకు ఎగబడ్డారు. కొంత మంది బారికేడ్లను దాటుకుని ముందుకు తోసుకు రావడంతో తొక్కిసలాట చేసుకుంది. ఈ సమయంలో కొంత మంది పుష్కరిణిలోకి దూకారు. ఈ సమయంలో ఒక వ్యక్తి పుష్కరిణిలో మునిగి మరణించాడు. అతని కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. అయితే ఆ వ్యక్తి శవమై కనిపించాడు. దీంతో భక్తుల్లో కలకలం రేగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X