వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవరగట్టు కర్రల సమరంలో ఒకరు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: కర్నూలు జిల్లా దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన కర్రల సమరంలో ఒక వ్యక్తి మరణించాడు. వందలమంది గాయపడ్డారు. ఈ సమరంలో లక్ష్మయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు.

ఆచారం ప్రకారం ప్రతి యేటా దసరా పర్వదినం రోజు ఈ కర్రల సమరం సాగుతుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కర్రల సమరం జరిగింది. ఆచారానికి, చట్టానికి మధ్య ఉన్న వైరుధ్యం వల్ల, చట్టంలోని లోపాల వల్ల దీన్ని ఆపలేకపోతున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. దేవుని రక్షణ కోసం ఈ కర్రల సమరం జరుగుతుందని, దీనివల్ల నష్టమేమీ లేదని ఆలయ కమిటీ చైర్మన్‌ అంటున్నారు. ఆచారం ప్రకారం ఇది జరుగుతోందని ఆయన అంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X