వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధ్యం: దత్తాత్రేయ
హైదరాబాద్: ఉద్యమాన్ని ఉధృతం చేయడం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలమని భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ కార్యదర్శి బండారు దత్తాత్రేయ అన్నారు. ఎన్నికల్లో జయాపజయాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాన్ని ఆయన మంగళవారంనాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నాయకులను సత్కరించారు.
కరీంనగర్ లోక్సభ ఉప ఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు పెడితే తమ పార్టీ బలపరుస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కె. ఆర్. సురేష్ రెడ్డితో పాటు టి. దేవేందర్ గౌడ్ (టిడిపి), ఎ. నరేంద్ర (తెరాస) తదితరులు పాల్గొన్నారు.
Comments
Story first published: Tuesday, October 3, 2006, 23:53 [IST]