వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ఎత్తు పెరిగితే ఒప్పుకోం: ఛత్తీస్‌ఘడ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రాజెక్టు ఎత్తు 150 అడుగులకు మించితే పోలవరం నిర్మాణానికి తాము అంగీకరించబోమని ఛత్తీస్‌ఘడ్‌ నీటి పారుదల శాఖ మంత్రి హేమచంద్ర యాదవ్‌ చెప్పారు. పోలవరంపై ఏర్పాటయిన ఛత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఆనకట్ట ఎత్తు 158 అడుగులు ఉంటే తమ రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లుతుందని, అందుకు తాము ఒప్పుకోమని ఆయన అన్నారు. సంయుక్త సర్వే జరిగే వరకు పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని, అయితే ముంపు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని ఛత్తీస్‌ఘడ్‌ నీటి పారుదల మంత్రి హేమచంద్ర యాదవ్‌ సమావేశంలో అన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి చెప్పారు.

పోలవరంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌కు ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రంలో చాలా మంది గిరిజనులు నిర్వాసితులవుతారని, ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం పలు సాంకేతిక అనుమతులను ఇంకా ఇవ్వాల్సే వుందని, ఈ స్థితిలో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం ఫలితం ఏమీ వుండదని ఆయన అన్నారు. అయితే ఒరిస్సాను ఒప్పించే బాధ్యతను కేంద్ర జల వనరుల మంత్రి సైఫుద్దీన్‌ సోజ్‌ తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X